News March 22, 2025
కోనసీమ జిల్లా డీఆర్డీఏ పీడీ నియామకం

కోనసీమ డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా టి సాయినాథ్ జయచంద్ర నియమితులయ్యారు. ఆయన శుక్రవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటివరకు పీడీగా పనిచేసిన శివ శంకర్ ప్రసాద్ పదోన్నతపై సర్ఫ్లో ఉన్నతి పథకం రాష్ట్ర డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కాకినాడలో ఉపాధి హామీ పథకం ఏపీడీగా పనిచేస్తున్న జయచంద్ర కోనసీమ జిల్లా ఏపీడీ బాధ్యతలు చేపట్టారు.
Similar News
News November 18, 2025
సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.
News November 18, 2025
సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.
News November 18, 2025
MLA కౌశిక్పై శ్రీశైలం యాదవ్ కామెంట్స్.. BRS ON FIRE

HZB MLA పాడి కౌశిక్ రెడ్డిపై జూబ్లీహిల్స్ MLA తండ్రి శ్రీశైలం యాదవ్ చేసిన కామెంట్స్పై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఓ MLAపై శ్రీశైలం అలాంటి వ్యాఖ్యలు చేయడం గుండాయిజమేనని BRS నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని, పోటీచేస్తే ఓడిపోతావని నవీన్తో కౌశిక్ అనడంపై ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో శ్రీశైలం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్కు జీవితం ఇచ్చిందే తామని, తను దెబ్బలు తింటే నవీన్ కాపాడాడన్నారు.


