News March 22, 2025

కోనసీమ జిల్లా డీఆర్డీఏ పీడీ నియామకం

image

కోనసీమ డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా టి సాయినాథ్ జయచంద్ర నియమితులయ్యారు. ఆయన శుక్రవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటివరకు పీడీగా పనిచేసిన శివ శంకర్ ప్రసాద్ పదోన్నతపై సర్ఫ్‌లో ఉన్నతి పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాకినాడలో ఉపాధి హామీ పథకం ఏపీడీగా పనిచేస్తున్న జయచంద్ర కోనసీమ జిల్లా ఏపీడీ బాధ్యతలు చేపట్టారు.

Similar News

News December 3, 2025

TG హైకోర్టు న్యూస్

image

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

News December 3, 2025

అన్నమయ్య జిల్లాలో తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయ నియామకాలు

image

అన్నమయ్య జిల్లా 17 మండలాల్లో 48 పాఠశాలల్లో D.Ed./ B.Ed. పూర్తి చేసిన అభ్యర్థులను 2025-26 విద్యా సంవత్సరానికి 5 నెలల వ్యవధికి తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయగా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.

News December 3, 2025

మోరంపూడి ఫ్లైఓవర్‌ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

మోరంపూడి ఫ్లైఓవర్‌ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.కాశీవిశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.