News March 17, 2025
కోనసీమ: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈవో షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏ ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9493819102కు తెలియజేయాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసి స్క్వాడ్లను నియమించామన్నారు.
Similar News
News January 7, 2026
రాత పరీక్షల నిర్వహణపై కోనసీమ జిల్లా జేసీ సమీక్ష

అమలాపురం మండలంలోని బట్లపాలెం ఇంజినీరింగ్ కళాశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరులోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఈనెల 8న ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్ బేస్డ్ డిపార్ట్మెంటల్ రాత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జేసీ నిశాంతి సూచించారు. బుధశారం ఆమె అమలాపురంలో అధికారులతో కలెక్టరేట్ వద్ద సమీక్షించి పలు సూచనలు చేశారు.
News January 7, 2026
అవకాడో సాగుకు అనువైన వాతావరణం

అవకాడో ఉష్ణమండల లేదా ఉపఉష్ణమండల వాతావరణంలో పెరిగే వృక్షం. కానీ చల్లని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా పెంచవచ్చు. అవకాడోను పండించడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 25- 33°C మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలమైనది. ఒకసారి మొక్క ఎదిగిన తర్వాత, చెట్లు (28°F) వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు, కాని లేత మొక్కలు గడ్డకట్టే ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. అవకాడోకు బాగా పొడిగా ఉండి నీరు నిలవని, గాలి బాగా ప్రసరించే నేల అవసరం.
News January 7, 2026
WGL మార్కెట్లో చిరుధాన్యాల ధరల్లో స్వల్ప తేడాలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్కి బుధవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,850 ధర రాగా..ఈరోజు రూ.8,700కి తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయకి మంగళవారం రూ.5,500 ధర వస్తే.. నేడు రూ.5,970 అయింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,080 పలికితే.. నేడు రూ.2,060 పలికింది. దీపిక రకం మిర్చికి మంగళవారం రూ. 16,500 ధర ఉంటే..ఈరోజు రూ.17,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.


