News March 24, 2025
కోనసీమ: నామినేటెడ్ పదవులు దక్కేది ఎవరికో?

మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందన్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో ఎవరికి పదవులు దక్కేనన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. కొత్తపేట నుంచి బీసీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజోలు నియోజకవర్గం నుంచి జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు, అమలాపురం నుంచి మెట్ల రమణబాబు, ముమ్మిడివరం నుంచి గుత్తుల సాయి, పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నాథ్బాబు, కొత్తపేట జనసేన నేత బండారు శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.
Similar News
News November 18, 2025
అనకాపల్లి: ‘రోజుకు 30-40 సదరం స్లాట్స్’

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపు ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ క్యాంపునకు వచ్చిన దివ్యాంగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల అర్హత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రోజుకు 30-40 స్లాట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. దీనిని ఆధునీకరించాల్సి ఉందన్నారు.
News November 18, 2025
వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
News November 18, 2025
24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లు: సత్యకుమార్ యాదవ్

AP: అత్యవసర వైద్య సేవల కోసం 24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్(CCB)లు అందుబాటులోకి రానున్నాయి. PMABHIM కింద ₹600 కోట్లతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. వీటి పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. వీటిలో 13 వచ్చే నెలాఖరుకు, మిగతావి 2026 ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కోవిడ్లో అత్యవసర వైద్యానికి ఇబ్బంది అయ్యింది. అటువంటివి మళ్లీ రాకుండా కేంద్రం దేశంలో 621 CCBలను నెలకొల్పుతోంది.


