News March 3, 2025

కోనసీమ: నేడే కౌంటింగ్.. జిల్లాలో ఉత్కంఠ

image

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లెక్కింపు నేడు జరగనుంది. 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా 27న జరిగిన పోలింగ్‌లో 63.26% ఓటింగ్ నమోదైంది. సోమవారం ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మరి కొన్నిగంటల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వీడనుంది.

Similar News

News March 23, 2025

పీఎం(జే.ఏ.ఎన్.ఏం.ఏ.ఎన్) పథకం కింద వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ అవకాశాలు

image

పీఎం(జే.ఏ.ఎన్.ఏం.ఏ.ఎన్) పథకం కింద కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్య ఆరోగ్యశాఖలో ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ (1), ల్యాబ్ టెక్నీషియన్ (1), పారామెడికల్ కం అసిస్టెంట్ పోస్టులు మొబైల్ మెడికల్ యూనిట్ లో పోస్టుల కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 26న జిల్లా కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. SHARE IT.

News March 23, 2025

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

image

టీ20 ఫార్మాట్‌లో 400 మ్యాచులు ఆడిన మూడో భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. KKRతో జరిగిన మ్యాచుతో ఈ ఘనత అందుకున్నారు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో కోహ్లీ (12,945) ఐదో స్థానంలో ఉన్నారు. గేల్ (14,562), హేల్స్ (13,610), షోయబ్ (13,537), పొలార్డ్ (13,537) తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

News March 23, 2025

ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

image

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్‌గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.

error: Content is protected !!