News April 13, 2025
కోనసీమ: మోగనున్న పెళ్లి బాజాలు.. మండపాలకు డిమాండ్

కొంత విరామం తర్వాత మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. దీంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, అల్లవరం, రాజోలు, పి.గన్నవరం మండలాల పరిధిలో కళ్యాణ మండపాలకు డిమాండ్ పెరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్లు, కళ్యాణ మండపాల నిర్వాహకులు సైతం బిజీ అయ్యారు. జూన్ వరకు ముహూర్తాలు ఉన్నాయి. పంచాంగకర్తలు చెప్పిన శుభ ముహూర్తాలు. ఏప్రిల్: 13,16,20,30 మే: 1,7,8,9,10,11,14,18,23 జూన్: 4,5,6,7,8
Similar News
News November 24, 2025
అమెరికా వీసా రాలేదని.. గుంటూరు డాక్టర్ సూసైడ్

అమెరికా J1 వీసా రాలేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ సూసైడ్ చేసుకుంది. గుంటూరుకి చెందిన డాక్టర్ రోహిణి కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం ఇటీవల వీసాకు అప్లై చేయగా.. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కలత చెందిన రోహిణి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుంటూరులోని సొంత నివాసానికి తరలించారు.
News November 24, 2025
ఎన్నికలకు సిద్ధం.. కోర్టుకు తెలపనున్న Govt, SEC

TG: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు ఇవాళ HCలో విచారణకు రానుంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్లు ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 50% రిజర్వేషన్లు మించకుండా GOలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పనుంది. అటు పూర్తి ఏర్పాట్లు చేశామని, అధికారులు, సిబ్బంది సమాయత్తంపై ఎన్నికల సంఘం వివరించనుంది. నిన్నటి నుంచి గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లపై మండల ఆఫీసుల్లో లిస్టులను అధికారులు ప్రదర్శనకు ఉంచారు.
News November 24, 2025
రేపు పులివెందులలో జగన్ పర్యటన

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.


