News January 31, 2025
కోనసీమ: మౌలిక సదుపాయాలకు ప్రతిపాదనలు రూపొందించాలి- కలెక్టర్

కోనసీమ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా నవీణీకరణ చేపట్టిన సర్వే ప్రతిపాదనలు కాంపోనెంట్ వారీగా విద్యార్థుల దామాషా ప్రాతిపదికన రూపొందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే నివేదికలలో స్పష్టత కొరబడిందన్నారు.
Similar News
News November 26, 2025
యథావిధిగానే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు..!

జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ముగిసింది. మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికను CMకు అందినట్టు సమాచారం. అయితే కృష్ణా, NTR జిల్లాలు యథావిధిగానే కొనసాగే అవకాశం ఉంది. కృష్ణాలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను NTR జిల్లాలో, ఏలూరు జిల్లాలోని కైకలూరును కృష్ణాజిల్లాలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎటువంటి మార్పులు లేకుండానే యథావిధిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News November 26, 2025
యథావిధిగానే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు..!

జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ముగిసింది. మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికను CMకు అందినట్టు సమాచారం. అయితే కృష్ణా, NTR జిల్లాలు యథావిధిగానే కొనసాగే అవకాశం ఉంది. కృష్ణాలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను NTR జిల్లాలో, ఏలూరు జిల్లాలోని కైకలూరును కృష్ణాజిల్లాలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎటువంటి మార్పులు లేకుండానే యథావిధిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News November 26, 2025
23 మంది TDP MLAలపై మంత్రి లోకేశ్ సీరియస్

AP: పార్టీ కంటే మంత్రులు, MLAలు ఎక్కువ కాదని TDP నేషనల్ సెక్రటరీ, మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది MLAలపై జోనల్ కో-ఆర్డినేటర్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. DEC 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.


