News January 30, 2025
కోనసీమ వాసి గెలిచేనా…?

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగనుంది. కూటమి తరఫున TDP అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు పేర్లు ఖరారయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన రాజశేఖరం గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. అప్పుడు జనసేనకు వెళ్లడంతో MLC అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మరి ఆయన గెలుస్తారా? లేదా? కామెంట్ చేయండి.
Similar News
News October 18, 2025
కండ్లపల్లి చెరువు కట్ట పరిశీలన.. డ్యామ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

జగిత్యాల శివారులోని కండ్లపల్లి చెరువు కట్ట ఇటీవల కుంగిపోయి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం కట్టను పరిశీలించారు. చెరువు కట్ట మరమ్మతులకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన పనులను సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు వారు సూచించారు. ఈ తనిఖీలో విశ్రాంత ఎన్సీ రామరాజు, సేఫ్టీ అధికారిణి విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, జియాలజిస్ట్ పద్మరాజు పాల్గొన్నారు.
News October 18, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాల్లో టార్ఫాలిన్, వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సిద్ధం చేయాలని, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, కొనుగోలు వెంటనే ట్యాబ్ ఎంట్రీ, నగదు/బోనస్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 18, 2025
కోరుట్ల: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసిన జువ్వాడి

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు, జగిత్యాల జిల్లా ఇన్చార్జ్ జై కుమార్కు దరఖాస్తును అందజేశారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తదితరులను ఆయన సన్మానించారు.