News January 30, 2025
కోనసీమ వాసి గెలిచేనా…?

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగనుంది. కూటమి తరఫున TDP అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు పేర్లు ఖరారయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన రాజశేఖరం గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. అప్పుడు జనసేనకు వెళ్లడంతో MLC అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మరి ఆయన గెలుస్తారా? లేదా? కామెంట్ చేయండి.
Similar News
News December 1, 2025
KNR: గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అభ్యర్థుల పేర్లు

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్లు గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కేటాయిస్తారు. కాగా ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే గుర్తులిస్తే బాగుంటుందని, ఎక్కువగా వాడని గుర్తులు అలాట్ చేస్తే ఓటర్లు ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని పలువురు చర్చిస్తున్నారు. ఐతే ఎక్కువమంది బరిలో ఉంటే అనువైన గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
ఖమ్మంలో ఎన్నికల వేడి.. ప్రత్యర్థులను తప్పించే ప్రయత్నాలు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తమ గెలుపుపై ప్రభావం చూపుతారని భావించిన కొందరు అభ్యర్థులు, డబ్బు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాల్లో శరవేగంగా నిమగ్నమయ్యారు.
News December 1, 2025
HNK: సర్పంచ్ ఎన్నికలు.. సోషల్ మీడియాపై అభ్యర్థుల ఫోకస్

జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న నేపథ్యంలో సర్పంచ్కు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టి తమను గెలిపిస్తే చేసే పనులు, ఎజెండాలను స్టేటస్, గ్రూప్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ మాత్రం ఉంటుందో చూడాల్సి ఉంది.


