News October 17, 2024
కోనసీమ: సీఎం హామీ.. ‘పల్లాలమ్మ’ ఆలయ అభివృద్ధికి కార్యాచరణ
కొత్తపేట వానపల్లి పల్లాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీ మేరకు నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైనట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఇంజినీర్లతో ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలు అంచనాలపై ఆయన సమీక్షించారు. వానపల్లి గ్రామస్థులు కోరిన విధంగా అవసరాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
Similar News
News October 17, 2024
మార్గాని భరత్ అండతో దాడి చేశారు: మంత్రి లోకేశ్
జగన్ని ఆదర్శంగా తీసుకొని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం పోయినా అరాచకాలు మాత్రం తగ్గట్లేదని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘జగన్ పాలనలో నేరాలకు అలవాటైన పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ అండతో ఈవెంట్ యాంకర్ కావ్య, ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ గుండాలు దాడి చేశారు. మహిళపై దాడి చేసిన గ్యాంగ్పై చర్యలు తప్పవు’ అని ఎక్స్ వేదికగా లోకేశ్ హెచ్చరించారు.
News October 17, 2024
తూ.గో.: TODAY TOP NEWS
* రంపచోడవరం: ‘పులి తిరిగేది ఆ ప్రదేశాల్లోనే.. జాగ్రత్త’
* రాజమండ్రిలో బంగారం దొంగతనం
* కాకినాడలో 13 మందికి జైలు
* కొవ్వూరులో షేర్ యాప్ పేరిట భారీ మోసం
* తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం
* కొత్తపేటలో బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్
* కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు
* జగ్గంపేట: మందుబాబులకు నిరాశే..!
* అయినవిల్లి: మద్యం షాపులు వద్దంటూ ఆందోళన
*అల్లవరంలో ఎగసిపడుతున్న సముద్రపు అలలు
News October 16, 2024
ఇసుక సరఫరాను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
ఇసుకను వినియోగదారులకు ఆఫ్లైన్ బుధవారం నుంచి ప్రారంభించినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చిన్న రాముడుతో కలిసి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ కోసం, ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎటువంటి ఆటంకం లేకుండా ఇసుక సరఫరా విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు.