News March 5, 2025
కోనసీమ : 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. వేణుగోపాలకృష్ణకు 1017 ఓట్లు, హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.
Similar News
News January 9, 2026
HNK: టెన్త్ విద్యార్థులకు అల్పాహార నిధులు విడుదల!

పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర సమగ్రశిక్ష విభాగం అల్పాహార నిధులు మంజూరు చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున, ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు (19 రోజులకు) ఈ అల్పాహార ఖర్చులు మంజూరు చేశారు. దీంతో వరంగల్లో 2,768 మందికి రూ.7.88 లక్షలు,
హనుమకొండలో 2,491 మందికి రూ.7.09 లక్షల నిధులు మంజూరయ్యాయి.
News January 9, 2026
‘భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

TG: ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా కొందరు మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కొంత ప్రభుత్వానికి జమ చేసి మిగతా నగదును పర్సనల్ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తేల్చారు. జనగామలో ఒక్కరోజే ₹8L తేడాను గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు జరిగాయేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
News January 9, 2026
నరసరావుపేటలో ఐపీ కలకలం.. ప్రముఖ వాహన డీలర్ దివాలా!

నరసరావుపేటలో ప్రముఖ ద్విచక్ర వాహన డీలర్ ఎర్రంశెట్టి సోదరులు దివాలా పిటిషన్ దాఖలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. రూ.60 కోట్ల మేర బకాయిలు చెల్లించలేక, వ్యాపార నష్టాల సాకుతో వీరు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా నమ్మకమైన వ్యాపారులుగా పేరున్న వీరు ఒక్కసారిగా IP నోటీసులు పంపడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భారీ మొత్తంలో డబ్బులిచ్చిన వారు తమ పెట్టుబడి ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


