News June 11, 2024
కోనసీమ: 3 రోజులు గరికపాటి ప్రవచనాలు

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని ధర్మగుండం చెరువు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22, 23వ తేదీల్లో మహ సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు సోమవారం తెలిపారు. శ్రీ సీతారామ కమ్యూనిటీ హాల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.
Similar News
News November 21, 2025
రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.
News November 21, 2025
తూ.గో: ‘రాజమౌళికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’

సినీ దర్శకుడు రాజమౌళిపై కేసులు నమోదు చేయడం బీజేపీ అసహనానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాజమండ్రిలో తెలిపారు. తక్షణమే ఈ అర్థరహితమైన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
News November 20, 2025
మల్లవరం పంచాయతీకి రాష్ట్రంలో ద్వితీయ స్థానం

శానిటేషన్ IVRS కాలింగ్లో చాగల్లు మండలం మల్లవరం పంచాయతీ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీదేవి గురువారం ప్రకటించారు. పబ్లిక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, ఇంటింటికీ చెత్త సేకరణకు 100 శాతం, కనీసం వారానికి రెండుసార్లు సేకరణకు 92 శాతం మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కమలావతిని ఎంపీడీవో సన్మానించారు.


