News July 23, 2024
కోనసీమ: 52 ఏళ్ల మహిళపై అత్యాచారయత్నం
మామిడికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(52)పై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు గెడ్డం సత్యనారాయణమూర్తిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని నగరం SI సురేష్ తెలిపారు. వరుసకి మరిది అయిన నిందితుడు బాధితురాలు వంట గదిలో ఒంటరిగా ఉండగా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నారు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయగా పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుణ్ని అరెస్ట్ చేశామన్నారు.
Similar News
News October 8, 2024
పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం
పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. స్టువర్టుపేటలో ఓ బాలిక నడిచివెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆటోలో మాధవపురం డంపింగ్ యార్డ్ తీసుకెళ్లారు. కాసేపయ్యాక ఆమెను ఆటోలో ఎక్కిస్తుండగా ఓ మహిళ చూసి నిలదీసింది. బాలిక బంధువులకు ఫోన్ చేయగా అక్కడికి చేరుకొన్నారు. మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదుచేయగా CI శ్రీనివాస్, SI మణికుమార్ కేసు నమోదుచేశారు.
News October 8, 2024
అన్నవరం: సత్యనారాయణ స్వామి ప్రసాదంలో విజయ నెయ్యి..!
తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు పలు ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో ఇక నుంచి విజయ నెయ్యిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్ గడువు ముగియడంతో దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఈ నెయ్యినే వినియోగించనున్నట్లు సమాచారం.
News October 8, 2024
తూ.గో: 9న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న నాదెండ్ల
తూ.గో.జిల్లా కాపవరం గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాధిక తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొంటారన్నారు.