News July 19, 2024

కోనసీమ: ATM కార్డు కాజేసి.. రూ.40,600 చోరీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో రజా హుస్సేన్‌కు చెందిన ఏటీఎం కార్డును ఓ వ్యక్తి కాజేసి రూ.40,600 విత్ డ్రా చేశాడు. బాధితుడు గురువారం నగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుస్సేన్ ఖాతాలో బుధవారం రూ.50 వేలు జమయ్యాయి. ఏటీఎం నుంచి హుస్సేన్ రూ.10 వేలు డ్రా చేశాడు. అతనిని గమనిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి హుస్సేన్ ఏటీఎం కార్డు కాజేసి డూప్లికేట్ కార్డు ఇచ్చాడు. ఒరిజినల్ కార్డుతో మిగతా నగదు కాజేశాడు.

Similar News

News November 18, 2025

రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

image

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

News November 18, 2025

రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

image

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

News November 18, 2025

రాజమండ్రి: ‘ప్రశాంతంగా 10 పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలి’

image

రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఎం. అమల కుమారి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె రాజమండ్రిలోని కంటిపూడి రామారావు మున్సిపల్ స్కూల్‌లోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.