News March 4, 2025
కోనసీమ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
Similar News
News December 18, 2025
తమిళనాడు బోట్లతో తీవ్ర ఇబ్బందులు: కలెక్టర్

తమిళనాడు నుంచి జిల్లాలోని సముద్ర జిల్లాలోనికి అక్రమంగా బోట్లు వస్తున్నాయని కలెక్టర్ హిమాన్ష శుక్లా అన్నారు. అమరావతిలో CM ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్షలో ఆయన మాట్లాడారు. తమిళనాడు బోట్లతో జిల్లా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్ష్ CMకు విన్నవించారు. జువ్వలదిన్నె హార్బర్ను కార్యాచరణలోకి తీసుకొస్తే సమస్యను పరిష్కరించవచ్చన్నారు.
News December 18, 2025
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పలు పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఆగస్టు 2025లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్, ఫార్మ్-డి రెండో ఏడాది రీ వాల్యుయేషన్ పరీక్షలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసి రీ వాల్యుయేషన్కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News December 18, 2025
అజరామరం.. సూర్యకాంతం అభినయం

వెండితెరపై ‘గయ్యాలి అత్త’గా సహజనటవిశ్వరూపం చూపిన నటశిఖరం సూర్యకాంతం వర్ధంతి నేడు. ఆమె కాకినాడ జిల్లా వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. ‘గుండమ్మ’గా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తెరపై కఠినంగా కనిపించినా, నిజజీవితంలో అమ్మలా ఆప్యాయతను పంచిన ఆ మహానటి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ సందర్భంగా గోదావరి జిల్లావాసులు, సినీ అభిమానులు ఆమె స్మృతులను ఘనంగా నెమరువేసుకుంటున్నారు.


