News March 4, 2025

కోనసీమ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

image

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.

Similar News

News December 13, 2025

NRPT: రెండో విడత పోలింగ్‌కు సిద్ధం

image

నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల పరిధిలో రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివారం రోజు 95 గ్రామ పంచాయతీలకు, 900 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ గెలుపుపై దీమా వ్యక్తం చేస్తుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

News December 13, 2025

మన్యం: జిల్లాలో 2,169 మంది అంగన్వాడీలకు ఫోన్లు అందజేత

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం 2,169 మొబైల్ ఫోన్లను సిబ్బందికి కేటాయించినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. శనివారం వన్ స్టాప్ కేంద్రం ఆవరణలో పంపిణీ చేపట్టారు. జిల్లాలోని మొత్తం 2,075 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున ఫోన్లు కేటాయించారు. వీరితో పాటు పర్యవేక్షణాధికారులైన 84 మంది సెక్టర్ సూపర్‌వైజర్లకు, పరిపాలనా సిబ్బందికి పంపిణీ చేశామన్నారు.

News December 13, 2025

గన్నవరం: పంచాయతీ ఎన్నికలు.. వంశీ వ్యూహంపై ఆసక్తి.!

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మైనింగ్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయడానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే వంశీ ఇటీవల పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఆయన వ్యూహ రచన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.