News April 24, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ నారాయణరెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తారా..?

image

ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి ఉత్తమ్‌ పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి నుంచి 4 లక్షల మెజార్టీ వస్తుందని, నల్గొండ నుంచి ఉత్తమ్ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తానని సవాల్ విసురుకుంటున్నారు. దీంతో వీరు దివంగత ఎంపీ రావి నారాయణరెడ్డికి వచ్చిన రికార్డును బ్రేక్​ చేస్తారా అనే చర్చ మొదలైంది. రావికి 1952లో 2,72,280మెజార్టీ వచ్చింది.

Similar News

News November 20, 2025

NLG: ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయం ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, FCI ED వనిత శర్మ, MLC శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్య నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, పంపిణీని మెరుగుపరచడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.

News November 20, 2025

NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.

News November 20, 2025

NLG: వామ్మో కోతులు

image

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.