News April 24, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ నారాయణరెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తారా..?

image

ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి ఉత్తమ్‌ పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి నుంచి 4 లక్షల మెజార్టీ వస్తుందని, నల్గొండ నుంచి ఉత్తమ్ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తానని సవాల్ విసురుకుంటున్నారు. దీంతో వీరు దివంగత ఎంపీ రావి నారాయణరెడ్డికి వచ్చిన రికార్డును బ్రేక్​ చేస్తారా అనే చర్చ మొదలైంది. రావికి 1952లో 2,72,280మెజార్టీ వచ్చింది.

Similar News

News January 15, 2025

భువనగిరి: గాలిపటం ఎగరవేస్తూ వ్యక్తి మృతి

image

పండగపూట ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలులో మంగళవారం జరిగింది. జూపల్లి నరేందర్ పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడ్డాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన అతణ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని చెప్పారు.

News January 15, 2025

నేడు వేములపల్లికి ఎమ్మెల్యే

image

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం వేములపల్లి మండల కేంద్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమనగల్లు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో అభివృద్ధి పోస్టర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News January 14, 2025

SRPT: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్త హత్య

image

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం రాత్రి సైదులు అనే వ్యక్తిని అతని ఇద్దరి భార్యలు <<15142827>>మర్డర్ చేసిన<<>> సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. చివ్వెంల మండలానికి చెందిన సైదులు కారు డ్రైవర్. కొన్ని రోజులుగా పెద్ద భార్య కూతురిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరు భార్యలు రోకలిబండతో సైదులును హతమార్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.