News March 11, 2025
కోరుకొండ: ఆకట్టుకుంటున్న నరసింహుడి గిరి

రాజానగరం నియోజకవర్గ మండలం ప్రధాన కేంద్రమైన కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వైకుంట ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట విద్యుత్ దీపా అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ గిరి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
Similar News
News November 24, 2025
టెన్త్ పరీక్షలపై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్: DEO

2026 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. పాఠశాల యూ-డైస్ డేటాతో సరిచూసుకుని, దోషరహితంగా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం.అమలకుమారిని 9849939487 నంబర్ను సంప్రదించాలని కోరారు.
News November 24, 2025
టెన్త్ పరీక్షలపై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్: DEO

2026 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. పాఠశాల యూ-డైస్ డేటాతో సరిచూసుకుని, దోషరహితంగా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం.అమలకుమారిని 9849939487 నంబర్ను సంప్రదించాలని కోరారు.
News November 23, 2025
సమస్య మీది.. పరిష్కారం మాది: తూ.గో కలెక్టర్

ఈనెల 24న కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను ముందుగానే ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేసి సమాచారం పొందవచ్చన్నారు. స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.


