News December 27, 2024

కోరుకొండ: స్కూల్ బస్సు కింద నలిగిన చిన్నారి జీవితం

image

LKG చదువుతున్న గీతాన్స్ (5)ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి శైలజతోపాటు వచ్చిన చెల్లి హన్సిక చౌదరి (3) అదే స్కూలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కోరుకొండ మండలం రాఘవపురంలో గురువారం జరిగింది. అల్లారు ముద్దుగా తనతో మాట్లాడిన మాటలే చెల్లె చివరి మాటలని తెలిసి గీతాన్స్ తల్లడిల్లిపోయాడు. తనతోపాటు హన్సిక వచ్చిన విషయాన్ని ఆ తల్లి గమనించలేదు. అదే చిన్నారి మృతికి కారణమైంది.

Similar News

News September 16, 2025

మంత్రి కందులను కలిసిన కలెక్టర్‌

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి మంత్రి కందుల దుర్గేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాజమండ్రికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతమని, దానిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కలెక్టర్‌కు సూచించారు.

News September 15, 2025

తూ.గో పోలీస్ గ్రీవెన్స్‌కు 40 అర్జీలు

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”లో 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మురళీకృష్ణ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సంబంధిత పొలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానకి కృషి చేశారు. అర్జీలలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయన్నారు.

News September 15, 2025

రాజమండ్రి: కలెక్టరేట్ PGRSలో 152 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 152 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.