News February 3, 2025
కోరుట్ల: ధర్మశాల భూమి పూజలో ఎమ్మెల్యే

కోరుట్ల పట్టణంలోని శ్రీ మహాదేవ స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ నందీశ్వర ధర్మశాల (కల్యాణ మండపం) భూమిపూజ కార్యక్రమంలో సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Similar News
News November 20, 2025
మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
News November 20, 2025
భద్రాచలం: నెల రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబరు 20 నుంచి జనవరి 9 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబరు 29న స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. అత్యంత ప్రసిద్ధి గాంచిన ఈ వేడుకల్లో భాగంగా డిసెంబరు 30న ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం పూజలు జరగనున్నాయి.
News November 20, 2025
హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.


