News August 12, 2024
కోరుట్ల: స్కాలర్షిప్లు విడుదల చేయాలని సీఎంకు పోస్ట్ కార్డులు

స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా విన్నవించారు. మూడేళ్లుగా స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల పరీక్ష ఫీజులు చెల్లించడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బస్ పాసుల కోసం డబ్బులు లేక కళాశాలకు రెగ్యులర్గా రాలేక చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్కాలర్షిప్ను విడుదల చేయాలని కోరారు.
Similar News
News October 24, 2025
JMKT: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

జమ్మికుంట పత్తి మార్కెట్లో నేటి నుంచి CCI ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా అయితేన్ మద్దతు ధర పొందవచ్చన్నారు. CCI ద్వారా పత్తి అమ్ముకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాలన్నారు. సమస్యలుంటే 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించండి.
News October 24, 2025
కరీంనగర్: పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ

శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 17 నుంచి LLB కోర్సులో 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రమైన ఆర్ట్స్ కళాశాలను VC యూ.ఉమేష్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం వాల్యూయేషన్ కూడా త్వరగా చేపట్టి ఫలితాలను సకాలంలో ప్రకటిస్తామని తెలిపారు.
News October 23, 2025
గన్నేరువరం PSను ఆకస్మిక తనిఖీ చేసిన CP

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గన్నేరువరం పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, ఆవరణలోని సీజ్డ్ వాహనాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించి సీసీటీఎన్ఎస్ 2.0, ఈ- సమన్లు, టీఎస్- కాప్, ఈ- సాక్ష్య తదితర సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తి పట్టు సాధించి వాటిని విధుల్లో విరివిగా వినియోగించాలని సూచించారు. FIR ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్షించి వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.