News April 12, 2025
‘కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలి’

హైకోర్టు తీర్పు ప్రకారం పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మత్స్యకారులకు ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర మత్స్యకార సంఘం ప్రతినిధి చింతకాయల ముత్యాలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరవాడ ఎమ్మార్వో అంబేడ్కర్కు శుక్రవారం మత్స్యకార నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ముత్యాలమ్మపాలెంకు చెందిన 500 మంది మత్స్యకారులకు 15 రోజుల్లో ఉపాధి కల్పించాలన్నారు.
Similar News
News December 20, 2025
ఇంట్లోనే మానిక్యూర్ చేసుకోవచ్చు

అందంగా, ఆరోగ్యంగా ఉండే గోళ్ల కోసం మానిక్యూర్ చేసుకోవడం తప్పనిసరి. దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. ముందుగా పాత నెయిల్ పాలిష్ని తొలగించాలి. తర్వాత గోళ్లను షేప్ చేసుకొని గోరువెచ్చటి నీటిలో షాంపూ, నిమ్మరసం కలిపి దాంట్లో చేతులు ఉంచాలి. తర్వాత చేతులను స్క్రబ్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చివరిగా మీకు నచ్చిన నెయిల్ పాలిష్ వేస్తే సరిపోతుంది. లేత రంగులు వేస్తే గోళ్లు సహజంగా అందంగా కనిపిస్తాయి.
News December 20, 2025
డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యం: కలెక్టర్

మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ జాతీయ, రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం కదిరి R&B గెస్ట్ హౌస్ నుంచి మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ చేశారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి యువత ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమన్నారు.
News December 20, 2025
ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్కు ప్రధాన కారణాలివే: ICMR స్టడీ

భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ టాప్ 3లో ఉంది. తాజాగా ICMR చేసిన స్టడీలో లేట్ మ్యారేజ్, 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ, 50 దాటాక మెనోపాజ్ వల్ల ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నట్లు తేలింది. పొట్ట దగ్గర ఫ్యాట్, ఫ్యామిలీ హిస్టరీ, నిద్రలేమి, స్ట్రెస్ వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 40 ఏళ్ల నుంచే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని స్టడీ సూచించింది.


