News March 6, 2025
కోర్టు మెట్లు ఎక్కకూడదు :వరంగల్ న్యాయమూర్తి

కుటుంబం, సమాజంలోని వ్యక్తుల మధ్య వచ్చే వివిధ తగాదాలను పరిష్కరించే ప్రయత్నం సామాజికవర్గ స్థాయిలోనే జరగాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ అన్నారు. అది కుటుంబానికి మరియు సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. వివాదాలను పోలీస్ స్టేషన్, కోర్టుల దాకా తీసుకువెళ్తే వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. ఇది సమాజానికి హానికరం అని చెప్పారు.
Similar News
News March 23, 2025
NRPT: జిల్లా క్రీడాకారునికి బ్రాంజ్ మెడల్

నారాయణపేట జిల్లా దామరగిద్ద చెందిన కనకప్ప పారా అథ్లెటిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ విభాగం నందు పాల్గొన్న కనకప్ప 5.30 మీటర్స్ దూకి, ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు రమణ వివరించారు. నారాయణపేట జిల్లాకు చెందిన అభ్యర్థి పతకం సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు,పీడీలు, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.
News March 23, 2025
విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ అధికారి సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2024 25 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా 19.05.2025 లోపు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08542-220020 నెంబర్ పై సంప్రదించాలన్నారు. SHARE IT.
News March 23, 2025
పీఎం(జే.ఏ.ఎన్.ఏం.ఏ.ఎన్) పథకం కింద వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ అవకాశాలు

పీఎం(జే.ఏ.ఎన్.ఏం.ఏ.ఎన్) పథకం కింద కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్య ఆరోగ్యశాఖలో ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ (1), ల్యాబ్ టెక్నీషియన్ (1), పారామెడికల్ కం అసిస్టెంట్ పోస్టులు మొబైల్ మెడికల్ యూనిట్ లో పోస్టుల కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 26న జిల్లా కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. SHARE IT.