News December 15, 2024
కోవూరు: రైలు నుంచి కిందపడి ఒకరు మృతి

కొవ్వూరు మండలం పడుగుపాడు ఇనమడుగు రైల్వే గేటు వద్ద ఇవాళ అస్సాంకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. సిల్చారు నుంచి తిరుచూరు వెళ్లే అరుణయ్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఆయన పొరపాటున కింద పడ్డాడు. ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి శరీరం రెండు భాగాలుగా వేరు పడింది. మృతుడిని అస్సాం రాష్ట్రం గోవిందపూర్ ప్రాంతానికి చెందిన షాలే అహ్మద్ (32)గా రైల్వే పోలీసులు గుర్తించారు.
Similar News
News November 28, 2025
గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే: జేసీ

మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యం.వెంకటేశ్వర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, కుల వివక్షత నిర్మూలనకై పోరాడారన్నారు.
News November 28, 2025
నెల్లూరులో గూడూరును కలవనీయకుండా అందుకే అడ్డుకున్నారా.?

గూడూరును నెల్లూరులో కలవనీయకుండా ఓ బడా పారిశ్రామికవేత చక్రం తిప్పినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో క్వార్జ్, అబ్రకం, మైకా వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి నెల్లూరుకు వెళితే ఖనిజాలపై ‘రెడ్ల’ ఆధిపత్యం పెరుగుతుందని దీనిని అడ్డుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎన్నికల్లోనూ ఆర్థికంగా ప్రభావం చూపించారట. తిరుపతి గ్రేటర్ పరిధి పెరుగుతన్న క్రమంలో గూడూరును సాంకేతికంగా నెల్లూరులో కలపలేదన్న వాదన కూడా ఉంది.
News November 28, 2025
నెల్లూరు మేయర్గా దేవరకొండ సుజాత..?

నెల్లూరు నగర మేయర్గా దేవరకొండ సుజాతను ఎంపిక చేసేందుకు టీడీపీ సిద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15లోగా ప్రస్తుత మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అనేక అంశాలను పరిశీలించి సుజాత పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈమె పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.


