News February 7, 2025

కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

image

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల సేవకు అంకితమై సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సుధీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.

Similar News

News October 16, 2025

కృష్ణా జిల్లాలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి

image

కృష్ణా జిల్లాలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరు మండలం పోరంకి వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ప్రభుత్వం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బందరు కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 49.6 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో రాకపోకలకు మార్గం సుగమం అయ్యేలా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది.

News October 16, 2025

గద్వాల: హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం

image

2025-26 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ-మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో కొత్త మెనూ పోస్టర్ ఆవిష్కరించారు. ఇకపై జిల్లాలోని అన్ని హాస్టళ్లలో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలన్నారు. కిచెన్ షెడ్లు, వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకుని, నాణ్యమైన ఆహారం ఇవ్వాలని సూచించారు.

News October 16, 2025

అనకాపల్లి: రేపు ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌లో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చునని అన్నారు. గత నెలలో జరిగిన గ్రీవెన్స్‌లో అర్జీలు అందజేసిన ఉద్యోగులు వచ్చి వాటి స్థితిని తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.