News January 25, 2025

కోస్గి: కొడంగల్‌కు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాఈ నెల 26న అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తుకు సిద్ధమవుతున్నారు.

Similar News

News February 27, 2026

ప్రజల ముంగిటకే పాలన: బాపట్ల కలెక్టర్

image

అధికారులు విధులకు పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులు, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించి ఆయన పాల్గొన్నారు. బాపట్ల సేవా సేతుతో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామన్నారు. తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్, వృద్ధుల హక్కుల కరపత్రాలు విడుదల చేశారు. బాధితుల వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించారు.

News February 27, 2026

జమ్మికుంట మార్కెట్‌లో స్థిరంగా పత్తి ధరలు..!

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈ వారం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. గత కొన్ని రోజులుగా పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.7,550 నుండి రూ.7,600 మధ్యనే ఊగిసిలాడింది. శుక్రవారం మార్కెట్‌కు 28 వాహనాల్లో 226 క్వింటాళ్ల విడి పత్తి రాగా గరిష్టంగా రూ.7,550 పలికింది. పత్తి నాణ్యత బాగున్నప్పటికీ మార్కెట్‌లో డిమాండ్ సాధారణంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

News February 27, 2026

KNR: రుచుల విందు.. ‘ఫ్లేవర్ ఫియస్టా’ పొందు!

image

SRR కళాశాలలో జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ఫ్లేవర్ ఫియస్టా పేరుతో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుతాయని కొనియాడారు. కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, అధ్యాపకులు రాజయ్య, నితిన్, కిరణ్మయి, మహేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.