News February 15, 2025

కోస్గి: రహదారి విస్తరణ పనులపై సమావేశం

image

కోస్గి పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులపై శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులు, ప్రధాన రహదారి వెంబడి ఇల్లు కోల్పోతున్న వారితో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించారు. రహదారి నిర్మాణంలో ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. 165 మంది బాధితులు ప్రభుత్వం అందించే నష్టపరిహారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వివరించారు.

Similar News

News November 20, 2025

కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

image

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.

News November 20, 2025

ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్‌ను కలిసిన కేయూ JAC

image

కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్‌గా పి.భాస్కర్ నూతనంగా నియామకమయ్యారు. ఈ సందర్బంగా కేయూ జేఏసీ నాయకులు గురువారం ఆయనను కలిశారు. ప్రిన్సిపల్‌ను శాలువాతో సన్మానించి, పూలమొక్క అందచేసి, శుభాకాంక్షలు తెలిపారు. డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం పనిచేయాలని, ఉన్నత శిఖరాలకు ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని వారు ప్రిన్సిపల్‌ను కోరారు.

News November 20, 2025

అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

image

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.