News February 15, 2025
కోస్గి: రహదారి విస్తరణ పనులపై సమావేశం

కోస్గి పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులపై శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులు, ప్రధాన రహదారి వెంబడి ఇల్లు కోల్పోతున్న వారితో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించారు. రహదారి నిర్మాణంలో ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. 165 మంది బాధితులు ప్రభుత్వం అందించే నష్టపరిహారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వివరించారు.
Similar News
News September 13, 2025
ములుగు: అత్యధికంగా వర్షం పడింది ఇక్కడే!

ములుగు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన కురిసింది. ప్రధానంగా ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం పడింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా వెంకటాపురం మండలంలో 106.5 మి.మీ. వర్షం కురిసింది. వాజేడు మండలం ధర్మారంలో 63మి.మీ., వాజేడులో 37మి.మీ., వెంకటాపూర్ లో 28.8మి.మీ., గోవిందరావుపేటలో 23.8మి.మీ., ఏటూరునాగారంలో 22.3మి.మీ. వర్షం పడింది.
News September 13, 2025
రాయికల్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రాయికల్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అయోధ్య నుంచి రాయికల్ వైపు వస్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 13, 2025
మంచిర్యాల: గిరిజనుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి: కలెక్టర్

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో డీసీపీ భాస్కర్తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గిరిజనులతో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద వెదురు సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తామని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.