News February 12, 2026

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: గద్వాల ఎస్పీ

image

గద్వాల జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 250 మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేని వ్యక్తులకు ప్రవేశం లేదని, కౌంటింగ్ సెంటర్‌లో మొబైల్ ఫోన్ల నిషేధం అమల్లో ఉందన్నారు. BNSS 163 అమల్లో ఉండగా, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

Similar News

News March 14, 2026

రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.

News March 14, 2026

నెతన్యాహు చనిపోయారా?

image

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.

News March 14, 2026

కార్యకర్తల మధ్యే మంత్రి.. సత్యకుమార్ వినయానికి ప్రశంసలు!

image

ధర్మవరంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ క్లాసులో మంత్రి సత్యకుమార్ కార్యకర్తలా పాల్గొని ప్రశంసలు పొందారు. పదవిలో ఉన్నా ప్రత్యేక సదుపాయాలు కోరలేదు. తోటి కార్యకర్తలతో కూర్చొని శ్రద్ధగా వినడం ఆయన వినయాన్ని ప్రతిబింబించింది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సేవాభావం ప్రతీ కార్యకర్తలో ఉండాలని ఆచరణతో చూపించారు. కార్యకర్తలతో నడవడమే నిజమైన నాయకత్వమని ఈ దృశ్యం తెలుపుతోంది.