News June 5, 2024

కౌంటింగ్ సమయంలో గుడ్డుపై ఈకలు పీకారా: MS రాజు

image

మడకశిరలో ఈవీఎంలు మార్చారనే వ్యాఖ్యలపై మడకశిర తాజా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందించారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కోడి గుడ్డుపై ఈకలు పీకారా అంటూ వైసీపీపై ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు అక్కడే ఉన్నారన్నారు. వైసీపీ పార్టీ ఏజెంట్లు ఇతర అధికారులు ఉండగా ఈవీఎం ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఈవీఎంలు ఎక్కడా మార్చలేదని స్పష్టం చేశారు.

Similar News

News November 13, 2025

10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

image

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

News November 13, 2025

భార్యను హతమార్చిన భర్త

image

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 13, 2025

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.