News May 27, 2024
కౌంటింగ్ సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు: కలెక్టర్
కౌంటింగ్ రోజున రాయలసీమ యూనివర్సిటీలోకి సాధ్యమైనంత వరకు కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ జి. సృజన పేర్కొన్నారు. ఆదివారం కర్నూల్ నగరంలోని రాయలసీమ యూనివర్సిటీ కేంద్రంలో పార్కింగ్, మొబైల్ డిపాజిట్ సెంటర్, ఫుడ్ కౌంటర్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News October 10, 2024
నంద్యాల: భోధనంలో పిడుగు
బండిఆత్మకూరు మండలం భోధనం గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం వర్షానికి ముందు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడింది. ఎవరూ లేని చోట ఉన్న వృక్షంపై పిడుగు పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.
News October 10, 2024
నంద్యాల: కొబ్బరి బొండంపై నవదుర్గల చిత్రాలు
ఆళ్లగడ్డకు చెందిన ఆర్టిస్టు విజయ్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొబ్బరి బొండంపై నవదుర్గ మాతల చిత్రాలను అక్రిలిక్ రంగులతో తీర్చిదిద్దారు. ఆది పరాశక్తి జగజ్జనని 9 రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి అమ్మవార్ల చిత్రాలను చిత్రీకరించారు.
News October 10, 2024
నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం
నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.