News March 3, 2025

కౌంటిగ్ ప్రారంభం.. ఈ ముగ్గురిలో గెలుపు ఎవరిదో ?

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఏయూలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఈనెల 27న జరిగిన ఎన్నికల్లో పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యే పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ హోరాహోరీగా తలపడ్డారు. 20,794 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News December 1, 2025

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

image

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. అయితే కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతలు కోస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

News December 1, 2025

GNT: నూతన HIV చికిత్స.. బిడ్డకు సోకే ప్రమాదం తగ్గింపు.!

image

సెప్టెంబర్, 2012 నుంచి జిల్లాలో HIV సోకిన ప్రతి గర్బిణికి 14వ వారము నుంచి నూతన చికిత్స విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తద్వారా బిడ్డకు HIV వచ్చే అవకాశం తగ్గుతుంది. అటు ఈ సంవత్సరం గుంటూరు, తెనాలిలోని సుఖవ్యాధి చికిత్సా కేంద్రాల నుంచి 4,785 మంది సుఖవ్యాధులు సోకినవారు చికిత్స పొందారు. జిల్లాలో షిప్ పాజిటివ్, హ్యాపెన్ సంస్థ, లయన్స్ క్లబ్, ల్యాంప్, రాజీవ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.

News December 1, 2025

వరంగల్: రాజకీయ పార్టీల్లో వలసల జోరు!

image

రాజకీయ పార్టీల్లో వలసల జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. డబ్బు, మద్యం, పదవుల ఆశ చూపడంతో పార్టీల్లో చేరికల పరంపర కొనసాగుతోంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కావడంతో వారిని తమ వైపు తిప్పుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం పార్టీల్లోకి చేరికలు జరిగాయి.