News March 15, 2025
కౌటాల: గ్రూప్-2లో 191, గ్రూప్-3లో 349వ ర్యాంకు

ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకి చెందిన <<15731264>>సాయిరాం గౌడ్ గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో<<>> సత్తా చాటాడు. నిన్న విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 349వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు విడుదలైన గ్రూప్- 2 ఫలితాల్లో 191వ ర్యాంకు సాధించాడు. గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ -1 మెయిన్స్లోను 436 మార్కులతో సాధించాడు. ప్రస్తుతం బెజ్జూరు మండలం మొగవెల్లి JPS విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News January 11, 2026
కామారెడ్డి: ముగిసిన స్పెషల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మూడు రోజులుగా జరిగిన కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారుల శిక్షణా తరగతులు ఆదివారం ముగిశాయి. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న ప్రత్యేక అధికారులకు పలు అంశాలపై మూడు రోజుల పాటు అవగాహన కల్పించారు. చివరి రోజు ప్రత్యేక అధికారులు పలు రకాల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.
News January 11, 2026
NZB: ‘నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు’

CM రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్లోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు.
News January 11, 2026
తాడికొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

తాడికొండ (మ) లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్(17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. తుళ్లూరు నుంచి ఐదుగురు యువకులు తాడికొండ YCP ఇన్ఛార్జ్ డైమండ్ బాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.


