News January 28, 2025
కౌటాల: టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి పోరాటం

కౌటాలకు చెందిన జ్యోత్స్న ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో 1:1తో సెలక్టయినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీని తీసుకున్నానని, అన్ని అర్హతలు ఉన్నా తనను కాదని తన కొలువును 13వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూ కోర్టులో కేసు వేశానని, ఉద్యోగం కోసం 8 నెలల గర్భంతో అవస్థలు పడుతూ ప్రజావాణికి వచ్చి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చానన్నారు.
Similar News
News October 30, 2025
జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ (12713-12714) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైలు ఇకనుంచి జనగామ స్టేషన్లో ఆగుతుందని SCR స్పష్టం చేసింది. ఈ నెల 30 నుంచి ఈ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
News October 30, 2025
నేడే కీలక పోరు.. భారత్ గెలిచేనా?

ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ.3 గంటల నుంచి సెమీ ఫైనల్-2 జరగనుంది. బలమైన AUSను ఎలాగైనా ఓడించాలని IND భావిస్తోంది. షఫాలీ వర్మ రాకతో టాపార్డర్ స్ట్రాంగ్గా మారనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న సౌతాఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది. ODI WCలలో ఇప్పటివరకు IND, AUS 14 మ్యాచుల్లో తలపడగా IND మూడింట్లో మాత్రమే గెలిచింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు.
News October 30, 2025
యూట్యూబ్ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

యూట్యూబ్ తన ప్లాట్ఫామ్లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్స్కేలింగ్’ అనే ఫీచర్ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్లో అప్లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్లో 4K క్వాలిటీ కంటే బెటర్గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.


