News November 21, 2024
కౌలు రైతుల సమస్యలపై మండలిలో ప్రశ్నించిన MLC కేఎస్

కౌలు రైతులకు రుణాలు అందకపోవడం అనేది సామాజిక సమస్య అని గుంటూరు, కృష్ణా పట్టభధ్రుల MLC లక్ష్మణరావు శాసనమండలిలో అన్నారు. APలో 26 లక్షల మంది కౌలు రైతులున్నారని చెప్పారు. భూయజమాని సంతకం ఉంటేనే రుణ అర్హత కార్డులు ఇస్తామనే నిబంధనతో చాలామంది నష్టపోతున్నారని చెప్పారు. భూమి మీద యజమానికి, పంట మీద కౌలు రైతుకి రుణాలు ఇవ్వడం మంచిదని సూచించారు. కులాన్ని బట్టి కాకుండా రైతులందరికీ రుణ అర్హత కార్డులివ్వాలన్నారు.
Similar News
News March 16, 2026
GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

విజయవాడ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2026
GNT: మిద్దెతోట సాగుదారులకు ఈ నెల 21న పురస్కారాలు

ప్రకృతిపై ప్రేమతో మిద్దెతోటలను పెంచుతున్న వారికి పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఈ నెల 21న పురస్కారాలు ప్రదానం చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 30 మంది మిద్దెతోట పెంపకందారులను ఎంపిక చేశారు. వారికి పురస్కారాలు అందించనున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు.
News March 16, 2026
GNT:”ఎస్పీ ఆఫీస్ లో పీజీఆర్ఎస్ రద్దు”

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దైంది.
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు విషయాన్ని గమనించి ఎస్పీ కార్యాలయానికి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని SP వకుల్ జిందాల్ సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను ముందు రోజు వెళ్లడిస్తామని చెప్పారు.


