News February 3, 2025
క్యాన్సర్ లక్షణాలు ఉంటే పరీక్షించుకోవాలి: దేశ్ పాండే

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి దేశ్ పాండే మాట్లాడుతూ.. రోజురోజుకూ వివిధ రకాలైన క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, తద్వారా నయం చేయవచ్చన్నారు.
Similar News
News January 14, 2026
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,014 మంది దర్శించుకోగా.. 19,639 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News January 14, 2026
యాంటీబయాటిక్స్తో ఎర్లీ ప్యూబర్టీ

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్ ప్రికాషియస్ ప్యుబర్టీ అంటారు.
News January 14, 2026
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ పబ్లిక్ టాక్

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. స్టోరీ లైన్ పాతదే అయినా కామెడీతో నవీన్ వన్ మ్యాన్ షో చేశారని ఆడియన్స్ తెలిపారు. పాటలను గ్రాండ్గా చిత్రీకరించారని, నిర్మాణ విలువలు బాగున్నాయన్నారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయని చెప్పారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ & రేటింగ్.


