News March 9, 2025

క్రికెటర్ ఇంట్లో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న ఎమ్మెల్యే

image

టీం ఇండియన్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ శనివారం తన నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో నాంపల్లి MIM ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ చేశారు. ఈ విందుకు సిరాజ్, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Similar News

News November 23, 2025

GHMC: సీసీ రోడ్ల పెండింగ్.. ఈ 3 జోన్లలో అధికం

image

​ఖైరతాబాద్ జోన్‌లో మొత్తం 506 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ రూ.14,042.7 లక్షలు. 27 BT రోడ్ల పనుల్లో కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి!​చార్మినార్ జోన్‌లో 728 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. విలువ రూ.13,556.93 లక్షలు. ఇక్కడ కూడా CC పనుల బకాయి రూ.12,778.78 లక్షలుగా ఉంది.​ LBనగర్ జోన్‌లో రూ.11,446.4 లక్షల విలువైన 175 పనులు మిగిలి ఉన్నాయి.​ <<18363545>>ఈ మూడు జోన్లలో<<>>ని రోడ్ల సమస్యలపై ప్రజాగ్రహం తప్పేలా లేదు.

News November 23, 2025

నగరానికి CC శాపం.. బడ్జెట్‌కు భారం!

image

పెండింగ్‌ పనుల్లో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్ల వాటా ఊహించని విధంగా ఉంది. ఈ కీలకమైన పనుల్లో జాప్యం వల్లే మొత్తం ఆర్థిక భారం పెరిగిపోయింది: ​1,952 CC రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. <<18363524>>వీటి అంచనా వ్యయం<<>> రూ.54,384.26 లక్షలు (సుమారు ₹543 కోట్లు). కేవలం 110 BT పనులకే రూ.6,419.91 లక్షలు పెండింగ్ ఉంది. మొత్తం రూ.608 కోట్ల పెండింగ్‌లో రూ.543 కోట్లు సీసీ రోడ్లకే కావడం గమనార్హం. ​

News November 22, 2025

తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

image

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్‌పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్‌నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.