News March 28, 2025
క్రికెట్లో సత్తా చాటిన ఎర్రగుంట్ల క్రీడాకారిణి

వైయస్సార్ కడపజిల్లా, ఎర్రగుంట్ల మండలం యర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో 6 వికెట్లు తీసి సత్తా చాటింది. గురువారం డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన మల్టీ డేస్ క్రికెట్ మ్యాచ్లో టీమ్-బీకి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి తొలిరోజు మ్యాచ్లో 32 ఓవర్లు వేసి 8 మెయిడిన్ ఓవర్లు, 6 వికెట్లు తీసి సత్తా చాటింది.
Similar News
News April 2, 2025
కడప: వైవీయూ దూర విద్యా పీజీ ఫలితాలు విడుదల

వైవీయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యు కేషన్ పీజీ 1, 2 సెమిస్టర్ల ఫలితాలను సీడీవోఈ డైరెక్టర్ ప్రొ. కె. కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డా. ఎం. శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ,, 1, 2వ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 08 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించామన్నారు. ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను అభినందించారు.
News April 2, 2025
ఒంటిమిట్టలో రైళ్లు నిలపాలి: ఎంపీ మిథున్ రెడ్డి

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, భక్తుల కోసం రాయలసీమ, తిరుమల, వెంకటాద్రి, తిరుపతి–గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లను ఒంటిమిట్టలో నిలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ మిథున్రెడ్డి రాసిన లేఖలో కోరారు.
News April 2, 2025
పోరుమామిళ్ల: యువతి ఆత్మహత్య

పెళ్లి కావడంలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోరుమామిళ్ల మండలంలో జరిగింది. పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరువెంగలాపురంలో రామ తులసి(25) అనే యువతి పెళ్లి కావడంలేదని మనస్థాపంతో మంగళవారం ఉరేసుకుంది. మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.