News February 9, 2025
క్రికెట్ టోర్నమెంట్లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం

ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.
Similar News
News February 23, 2026
సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కొట్టివేత

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన <<19208192>>ఏకసభ్య కమిషన్ను<<>> సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. పరిపాలనా పరమైన లోపాల గుర్తింపునకు ఆ కమిషన్ను ఏర్పాటు చేశారని CJI ధర్మాసనం అభిప్రాయపడింది. సిట్ దర్యాప్తును కమిషన్ ప్రభావితం చేయబోదని పేర్కొంది.
News February 23, 2026
భారీ స్కామ్.. IDFC షేర్లు ఢమాల్

చండీగఢ్ బ్రాంచ్లో రూ.590 కోట్ల స్కామ్ వెలుగుచూడటంతో IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇవాళ భారీగా పతనమవుతున్నాయి. ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల అమ్మకాలు చేపట్టారు. దీంతో గరిష్ఠంగా 20శాతం నష్టం చవిచూడగా తర్వాత కాస్త పుంజుకొని ప్రస్తుతం 16శాతం వద్ద కొనసాగుతోంది. హరియాణా ప్రభుత్వ విభాగం తమ బ్యాంకు ఖాతాను క్లోజ్ చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది.
News February 23, 2026
సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.


