News February 9, 2025
క్రికెట్ టోర్నమెంట్లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం

ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.
Similar News
News December 22, 2025
కోడిపుంజులకు కొట్లాటపై Pre Finals!

AP: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంప్రదాయమైన కోడి పందేలకు పుంజులను సన్నద్ధం చేయడం తుది దశకు చేరింది. ఎగ్స్, కాజు, బాదం తదితర విటమిన్ ఫుడ్తో నెలలుగా ప్రత్యేకంగా పెంచి పోషించిన కోళ్లకు నిర్వాహకులు ప్రస్తుతం పందేల ట్రైనింగ్ ముమ్మరం చేశారు. ప్రత్యర్థి కోడిపై బలంగా దాడి చేసేలా, బరిలో ఎక్కువసేపు నిలబడేలా స్పెషల్ కేర్ టేకర్స్, ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు.
News December 22, 2025
16 సోమవారాల వ్రతం.. ఎలా చేయాలి?

ఉదయాన్నే స్నానమాచరించాలి. శివలింగానికి గంగాజలం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. పూజలో బిల్వపత్రాలు, తెల్లటి పుష్పాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వ్రత కథను చదివి రోజంతా ‘ఓం నమః శివాయ’, ‘మహామృత్యుంజయ’ మంత్రాన్ని జపించాలి. ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ వ్రతం వల్ల మానసిక ప్రశాంతత, అన్యోన్య దాంపత్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
News December 22, 2025
కంగ్టి: భర్త ఆటో డ్రైవర్.. భార్య సర్పంచ్

కంగ్టి మండలం ముర్కుంజాల్ సర్పంచిగా సారంగి అనూష లాల్ కుమార్ ఎన్నికయ్యారు. ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో, బరిలోకి దిగిన ఆమె ఘన విజయం సాధించారు. అనూష భర్త లాల్ కుమార్ ఆటో డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి, ప్రజల సేవకు అంకితమవుతానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.


