News February 2, 2025
క్రికెట్ పోటీల్లో గద్వాల రాణించాలి: కలెక్టర్

గద్వాల జిల్లా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రం, దేశ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో షేర్ అలీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని సూచించారు.
Similar News
News February 24, 2026
అనంతపురం: భార్యపై కొడవలితో దాడి చేసిన భర్త

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన అనంతపురంలో మంగళవారం జరిగింది. పాతూరులో నివాసం ఉంటున్న గౌరమ్మ తలపై భర్త నాగభూషణం కొడవలితో తీవ్రంగా దాడి చేశాడు. గాయపడ్డ ఆమెను స్థానికులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌరమ్మ చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న ఒకటవ పట్టణ పోలీసులు నిందితుడు నాగభూషణంను అదుపులోకి తీసుకున్నారు.
News February 24, 2026
ఖమ్మం: ‘నకిలీ’ ఉచ్చు.. కల్తీ దందాను అరికట్టేదెవరు?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ, కల్తీ వస్తువుల దందా విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యావసరాల నుంచి మందులు, విత్తనాలు, వరకు అన్నింటికీ నకిలీలు పుట్టుకొస్తున్నాయి. బ్రాండెడ్ పేర్లతో తక్కువ ధరకు నాసిరకం వస్తువులను అంటగడుతూ వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ దెబ్బతీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కల్తీ రాజ్యం మరింత విస్తరిస్తోంది.
News February 24, 2026
5min లేటైనా పరీక్షకు అనుమతి: ఇంటర్ బోర్డు

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ <<19217020>>పరీక్షలు<<>> జరగనున్నాయి. ఉ.9కి ఎగ్జామ్ ప్రారంభం కానుండగా పరీక్ష సమయానికి 5min లేటైనా విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. అటు APలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలి రోజు 5.24L మంది హాజరయ్యారు. నేడు సెకండియర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాగా APలో నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.


