News March 23, 2025
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు: అన్నమయ్య SP

క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఎస్పీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో మ్యాచ్ను చూసి ఆనందించాలన్నారు. అంతకు మించి బెట్టింగులకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
Similar News
News October 21, 2025
మనందరి తొలి ఆర్ట్ టీచర్ ఈయనే.. ఏమంటారు?

మనలో చాలా మంది సృజనాత్మకతను తొలిసారి బయటకు తీసింది POGO ఛానల్లో వచ్చిన ‘M.A.D. with Rob’ షోనే. ఇది 90S కిడ్స్కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హోస్ట్ రాబ్ మనందరి తొలి ఆర్ట్ టీచర్. ఆయన వేస్ట్ నుంచి బెస్ట్ క్రాఫ్ట్స్ ఎలా చేయాలో చక్కగా వివరించేవారు. దాన్ని ఫాలో అయి మనమూ రూపొందిస్తే పేరెంట్స్ సంతోషించేవారు. అందుకే ఈ షో చూసేందుకు వారు ప్రోత్సహించేవారు. దీనిని మరోసారి ప్రసారం చేయాలనే డిమాండ్ నెలకొంది.
News October 21, 2025
జూబ్లీహిల్స్లో బీజేపీ-మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ: రాంచందర్రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP, మజ్లిస్ మద్దతు తెలిపిన కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని TBJP చీఫ్ రామచందర్రావు అన్నారు. BJP అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. వారు పోటీలో ఉన్నట్లు నటించడమే తప్పు. వాస్తవానికి ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. జూబ్లీహిల్స్లో పథకాలు అమలు కావట్లేదు. సమస్యలు పట్టిపీడిస్తున్నాయి’ అన్నారు.
News October 21, 2025
జూబ్లీహిల్స్లో బీజేపీ-మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ: రాంచందర్రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP, మజ్లిస్ మద్దతు తెలిపిన కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని TBJP చీఫ్ రామచందర్రావు అన్నారు. BJP అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. వారు పోటీలో ఉన్నట్లు నటించడమే తప్పు. వాస్తవానికి ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. జూబ్లీహిల్స్లో పథకాలు అమలు కావట్లేదు. సమస్యలు పట్టిపీడిస్తున్నాయి’ అన్నారు.