News March 23, 2025
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు: అన్నమయ్య SP

క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఎస్పీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో మ్యాచ్ను చూసి ఆనందించాలన్నారు. అంతకు మించి బెట్టింగులకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
Similar News
News November 19, 2025
సంగారెడ్డి: భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ వంటి కీలక ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, నిమ్జ్ ప్రత్యేక అధికారిని విశాలాక్షి పాల్గొన్నారు.
News November 19, 2025
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అక్రిడియేషన్ కార్డుల జాప్యం, జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ అమలు చేయకపోవడం, పలు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు.
News November 19, 2025
జనగామ: గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి

జనగామ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించడంతో జిల్లాలోని 281 గ్రామాలలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది.


