News March 12, 2025
క్రీడాకారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు పంపిణీ

అల్లూరి జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా నుంచి జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఆర్చరీ, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, కబడ్డీ పోటీల్లో 15 మంది పాల్గొన్నారు. దీనిలో హ్యాండ్ బాల్ 2వ స్థానం సాధించిన గౌరీ శంకర్, డిస్కస్ త్రోలో 3వ స్థానం సాధించిన చంద్రశేఖర్ నాయుడును కలెక్టర్ అభినందించారు.
Similar News
News February 17, 2026
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖ చేరుకున్నారు. నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాలో రాష్ట్రపతికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, జిల్లా ఉన్నతాధికారులు, నావికాదళ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేవల్ బేస్కు చేరుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బ్యాంక్వెట్ విందుకు హాజరై అక్కడే రాత్రి బస చేయనున్నారు. రేపటి నుంచి జరిగే IFR ప్రధాన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
News February 17, 2026
సీతంపేట: గిరిజన అభ్యర్థులకు గుడ్ న్యూస్

ఈనెల 18వ తేదీ నుంచి సీతంపేట వైటీసీలో ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నీషియన్ శిక్షణను ప్రారంభించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు శిక్షణ ఇస్తామని, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ITI, ఇంటర్ ఉత్తీర్ణులైన గిరిజన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు.
News February 17, 2026
మళ్లీ పెళ్లికి సిద్ధం: మమతా మోహన్ దాస్

మరోసారి ప్రేమలో పడేందుకు, పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని హీరోయిన్ మమతా మోహన్దాస్ వెల్లడించారు. అందుకు తగిన వ్యక్తి దొరకాలని ఓ పాడ్కాస్ట్లో అన్నారు. 2011లో బిజినెస్మ్యాన్ ప్రేజిత్తో ఆమె వివాహం జరగగా ఏడాదికే విడిపోయారు. ‘ప్రేజిత్ను ఓ పెళ్లిలో మళ్లీ కలిశా. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా అనిపించాయి. మళ్లీ మనం పెళ్లి ఎందుకు చేసుకోకూడదని అడిగాడు. వెళ్లి మా నాన్నతో మాట్లాడమని చెప్పా’ అని తెలిపారు.


