News November 24, 2024

క్రీడాభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా సంఘాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవోతో పాటు ఒలింపిక్ సంఘం పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

image

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

News November 13, 2025

జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో మృతదేహం

image

ఆరిలోవ స్టేషన్ పరిధి జోడుగుళ్లపాలెం బీచ్‌కు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం ఉదయం కొట్టుకొచ్చిందని పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని.. రెండు చేతుల మీద పచ్చబొట్లు ఉన్నాయని చెప్పారు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని సీఐ మల్లేశ్వరరావు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామన్నారు.

News November 13, 2025

పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో CM చంద్రబాబు

image

విశాఖలో CII సుమ్మిట్‌లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నట్లు CM పేర్కొన్నారు.