News February 8, 2025
క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ.2.16 కోట్లు: జేసీ

జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై శుక్రవారం సమీక్షించారు. ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు రూ 2.16 కోట్లు కేటాయించారన్నారు.
Similar News
News January 8, 2026
సుల్తాన్పూర్ జేఎన్టీయూకు యూనివర్సిటీ హోదా: మంత్రి

సుల్తాన్పూర్ JNTU క్యాంపస్ను భవిష్యత్తులో పూర్తిస్థాయి యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. విశాల ప్రాంగణం, మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అఫిలియేషన్కు సరిపడా కళాశాలలు ఉన్నట్లు వివరించారు. పారిశ్రామిక ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ త్వరలోనే మరిన్ని స్కిల్డ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
News January 8, 2026
వేములవాడ: కన్నుల పండువగా.. వీనుల విందుగా..! ….

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీత్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల తొలిరోజు కార్యక్రమాలు కన్నుల పండువగా, వీనుల విందుగా సాగాయి. సాయంత్రం అనుపమ హరిబాబు బృందం శాస్త్రీయ సంగీత కచేరి, వి.జానకి బృందం శాస్త్రీయ సంగీతంతో సంగీతాభిమానులను అలరించారు. వి.నవ్యభారతి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా శివపార్వతి భాగవతారిణి హరికథ ఆకట్టుకుంది.
News January 8, 2026
హన్మకొండ పరిధిలో 22 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 22 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మంది మద్యం తాగిన వారితో పాటు మరో 8మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారు ఉన్నారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


