News February 8, 2025

క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ.2.16 కోట్లు: జేసీ 

image

జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై శుక్రవారం సమీక్షించారు. ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు రూ 2.16 కోట్లు కేటాయించారన్నారు.

Similar News

News February 8, 2025

BJP విజయానికి అసదుద్దీన్, MIM హెల్ప్!

image

BJP విజయంలో MIM పరోక్షపాత్రపై చర్చ జరుగుతోంది. ఆమ్‌ఆద్మీని మట్టికరిపించడంలో అసదుద్దీన్ ప్రభావం తోడైందంటున్నారు. ఢిల్లీలో ముస్లిములు గణనీయంగా ఉంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న వీరు పదేళ్లుగా AAPకు ఓటేస్తున్నారు. ఈసారి పార్టీలన్నీ పొత్తుల్లేకుండా బరిలోకి బలమైన అభ్యర్థులనే దించడంతో ముస్లిముల ఓట్లు చీలాయి. MIMకు మొత్తం 80వేల ఓట్లు రావడం స్వల్ప మార్జిన్లతో చాలాచోట్ల BJPని గెలిపించింది.

News February 8, 2025

బెల్లంపల్లి రేంజ్‌లోనే పులి ఆవాసం!

image

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.

News February 8, 2025

కేజ్రీవాల్ ఓటమికి 2 కారణాలు: పీసీసీ చీఫ్

image

BRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రీవాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు. ఇక కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.

error: Content is protected !!