News April 2, 2025
క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చిన నాగర్కర్నూల్ ఎస్పీ

వెల్దండ మండలంలోని కోట్రగేట్ సమీపంలో ఆటో బోల్తా పడి పలువురు గాయపడ్డారు. అటు నుంచి వెళ్తున్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెంటనే వాహనాన్ని ఆపి ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో పోలీసు వాహనాన్ని రప్పించి వాహనంలో గాయపడ్డ వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానికులు ఎస్పీని అభినందిస్తున్నారు.
Similar News
News November 4, 2025
‘నీ కోసం నా భార్యను చంపేశా’.. మహిళలకు ఫోన్పేలో మెసేజ్

బెంగళూరులో కృతికా రెడ్డి అనే డాక్టర్ హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెను హత్య చేసిన కేసులో భర్త మహేంద్రా రెడ్డి గత నెలలో అరెస్టయ్యాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశా’ అని ఐదుగురు మహిళలకు ఫోన్పేలో అతడు మెసేజ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్లో హత్య తర్వాత కొన్నాళ్లకు ఇలా చేశాడని, పాత బంధాలను తిరిగి కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని చెప్పారు.
News November 4, 2025
బాపట్లలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు

ప్రైవేటు బస్సులు నడిపేవారు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. బాపట్ల పట్టణంలో పట్టణ పోలీసులతో కలిసి ప్రైవేటు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎమర్జెన్సీ డోర్లను పరిశీలించారు. బస్సుల పత్రాలను పరిశీలించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులలో ఫైర్ సేఫ్టీ సిలిండర్ అందుబాటులో ఉంచుకోవాలని పరిమితికి మించి వేగంగా ప్రయాణించవద్దని సూచించారు.
News November 4, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు: మణుగూరు డీఎస్పీ
✓దమ్మపేట: కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
✓జిన్నింగ్ మిల్లులు యధాతధంగా కొనసాగించాలి: జిల్లా కలెక్టర్
✓భద్రాచలం ఎమ్మెల్యేను నిలదీసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
✓సుజాతనగర్ హైస్కూల్ టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం
✓బూర్గంపాడు – సారపాక రోడ్డుకు మరమ్మతులు
✓ములకలపల్లి: అడవి పందిని వేటాడిన వ్యక్తి అరెస్ట్
✓పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా


