News April 2, 2025
క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చిన నాగర్కర్నూల్ ఎస్పీ

వెల్దండ మండలంలోని కోట్రగేట్ సమీపంలో ఆటో బోల్తా పడి పలువురు గాయపడ్డారు. అటు నుంచి వెళ్తున్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెంటనే వాహనాన్ని ఆపి ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో పోలీసు వాహనాన్ని రప్పించి వాహనంలో గాయపడ్డ వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో స్థానికులు ఎస్పీని అభినందిస్తున్నారు.
Similar News
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.


