News November 28, 2024

క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రి

image

రాష్ట్ర కార్మిక పారిశ్రామిక మంత్రి వాసంశెట్టి సుభాష్ విశాఖ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో జిల్లాకు చేరుకుంటారని మంత్రి కార్యదర్శి వెంకట సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అనకాపల్లి జిల్లా పరవాడ టాగూర్ ఫార్మా పరిశ్రమలో పర్యటించి ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకుంటారు. అనంతరం విశాఖలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.

Similar News

News November 21, 2025

విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

image

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్‌ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్‌ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్‌ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.

News November 21, 2025

విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

image

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్‌ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.

News November 21, 2025

ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.