News August 5, 2024

ఖడ్గవలస: ప్రధాన రహదారిపై ఏనుగుల గుంపు

image

పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారిలోని ఖడ్గవలస కూడలిలో ఉన్న రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప రహదారుల పైకి రావద్దని సూచించారు.

Similar News

News October 28, 2025

అన్ని బృందాలు సిద్ధంగా ఉన్నాయి: డీఐజీ

image

మొంథా తుఫాను సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. బర్రిపేటలో సోమవారం ఆయన పర్యటించారు. తీరప్రాంతాల్లో మెరైన్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయం వచ్చే అవకాశం ఉందని, ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News October 27, 2025

VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలు

image

జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని DRO శ్రీనివాసమూర్తి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లో.. పోలింగ్ కేంద్రాల స్థాన మార్పు కోసం 23, పేరు మార్పు కోసం 51, కొత్త పోలింగ్ కేంద్రాలుగా 122 ప్రతిపాదనలు గుర్తించబడినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలు భారత ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు వెల్లడించారు.

News October 27, 2025

VZM: జర్మనీలో ఉద్యోగాలకు 30న జాబ్ మేళా

image

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. జర్మనీలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం అక్టోబర్ 30న విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.2.60 లక్షల వరకు టాక్స్ ఫ్రీ వేతనం, ఉచిత వసతి, వైద్యం, రవాణా సదుపాయం కల్పించబడుతుందని ఆయన తెలిపారు.