News June 22, 2024

ఖమ్మంపై పట్టు పెంచుకుంటున్నా: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

image

‘సేవా చేయాలనే ఆలోచనతోనే సివిల్స్ ఎంచుకున్న. వైద్యం, విద్య, వ్యవసాయం ప్రాధాన్యతా అంశాలుగా ఎంచుకుని దృష్టి సారిస్తా’ అని అంటున్నారు ఖమ్మం కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ముజమ్మిల్ ఖాన్. ఖమ్మం జిల్లాపై పట్టు పెంచుకుంటున్నానని చెప్పారాయన. తన తాత, నాన్న ఇలా మూడు తరాలు సివిల్ సర్వీసెస్‌లోనే ఉన్నారని ప్రజా సేవలో దొరికిన సంతృప్తి మరెక్కడా లభించదని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెబుతున్నారు.

Similar News

News October 7, 2024

సత్తుపల్లి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

సత్తుపల్లి మండలం<<14289034>> రేగళ్లపాడుకి చెందిన సైద్‌పాషా సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పాషా స్నేహితుడు ఖాసుబాబు వారం కిందట పాషా సెల్‌ఫోన్ నుంచి ఓ వివాహితకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ వివాహిత తన భర్తకి ఈ విషయం తెలియడంతో పాషా షాప్ దగ్గరకు వచ్చి అతడిపై దాడి చేశాడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని అవమానంగా భావించిన పాషా సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 7, 2024

న్యూజిలాండ్‌లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి

image

న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.

News October 7, 2024

విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

image

గుండాల మండలంలో విద్యుత్ షాక్‌తో బాలిక మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెన్నెలబైలు గ్రామానికి చెందిన కృష్ణారావు, సుమలత దంపతుల కుమార్తె సువర్ణ (12). ఆదివారం సాయంత్రం ఇంట్లో కరెంట్ వైరు తెగి ఐరన్ తలుపులపై పడింది. అది గమనించని సువర్ణ ఇంట్లోకి వెళుతూ తలుపులను తాకింది. దీంతో షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.