News April 7, 2025
ఖమ్మంలో ఏలూరు జిల్లా వాసి మృతి

ఖమ్మం పట్టణం నేతాజీనగర్లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. చింతలపూడికి చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి గత 4 నెలలుగా ఓ మహిళతో నేతాజీ నగర్లో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వీరిద్దరి మధ్య రాత్రి వాగ్వాదం జరగడంతో రవిప్రసాద్ను సదరు మహిళ గోడకు నెట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 27, 2025
గుంటూరు జిల్లాలో నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,99,558 కార్డులు ఉండగా వాటికి తోడు మరో 9 వేలు కొత్త కార్డులు తాజాగా ఆమోదించారు. తొలివిడతగా జిల్లాకు 5,85,615 స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఇప్పటివరకు 5,23,418 కార్డులను మాత్రమే పంపిణీ చేయగా, మరో 80 వేల కార్డులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు డీలర్లు, సచివాలయ సిబ్బంది దగ్గర పేరుకుపోయాయి.
News October 27, 2025
వైద్యురాలి ఆత్మహత్య.. సంచలన ఆరోపణలు

MHలో సూసైడ్ చేసుకున్న <<18107450>>వైద్యురాలిపై<<>> ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ‘గతంలో నా కూతురిని ఆమె భర్త అజింక్య(ఆర్మీ ఆఫీసర్), అత్తింటివాళ్లు చంపేశారు. కానీ సూసైడ్ చేసుకుందని లేడీ డాక్టర్ ఫేక్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చింది. ఆమెను ఎవరో ఒత్తిడి చేసినందుకే ఈ పని చేసింది. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా SI గోపాల్తో పాటు ఓ MP తనను వేధించారంటూ సదరు వైద్యురాలు సూసైడ్ నోట్లో రాసిన విషయం తెలిసిందే.
News October 27, 2025
ఎన్టీఆర్: వాయిదా పడిన కేంద్ర మంత్రి నిర్మల అమరావతి పర్యటన

అమరావతిలో మంగళవారం జరగాల్సిన బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. కార్యక్రమం జరిగే తదుపరి తేదీ తెలియాల్సి ఉంది. కాగా ఉద్దండరాయునిపాలెంలో 12 బ్యాంకులకు CRDA స్థలాలు కేటాయించగా..శంకుస్థాపన జరిగిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.


