News April 4, 2024
ఖమ్మంలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్.. 185మంది డుమ్మా

టెన్త్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైంది. కాగా డ్యూటీ ఆర్డర్లు తీసుకున్న వారిలో తొలిరోజు సమాచారం ఇవ్వకుండానే 185 మందికి పైగా విధులకు గైర్హాజరయ్యారు. డీఈవో సోమశేఖర శర్మ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇచ్చారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం: అంగన్వాడీల్లో కనిపించని సమయపాలన..

జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బదులు ఆలస్యంగా కేంద్రాన్ని తెరవడం, అలాగే సాయంత్రం 4 గంటలకు ముందే 3 గంటలకే ఇంటికి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ వెంటనే దృష్టి సారించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News November 16, 2025
ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు: సీపీ

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CP సునీల్ దత్ అన్నారు. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్ ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్, మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పిర్యాదు చేయాలన్నారు.
News November 16, 2025
ఖమ్మం: లోక్ అదాలత్లో 4,635 కేసులు పరిష్కారం

కేసుల రాజీతో కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. రాజగోపాల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించారు. మొత్తం 4,635 కేసులను పరిష్కరించారు. వీటిలో క్రిమినల్ కేసులు 596, ఈ పెట్టి కేసులు 2, 350, చెక్ బౌన్స్ 53, ఇతర కేసులు 1,636 ఉన్నాయి. పరిష్కారం చేసుకున్న కక్షిదారులకు పూల మొక్కలు, అవార్డులు బహూకరించారు.


