News August 14, 2024

ఖమ్మంలో దారుణ ఘటన.. మనవడిని అమ్మేసిన నాయనమ్మ

image

మనవడిని డబ్బుల కోసం నాయనమ్మ అమ్మేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. స్వప్న- సాయికి 2021లో వివాహమైంది. వీరికి యశ్వంత్ అనే 21 నెలల బాలుడున్నాడు. ఇటీవల సాయి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో స్వప్న అత్త నాగమణితో కలిసి ఉంటోంది. స్వప్నను వేరే వివాహం చేసుకోవాలని నమ్మించి యశ్వంత్‌ను నాగమణి వేరే వ్యక్తికి విక్రయించింది. విషయం తెలుసుకున్న స్వప్న 1-టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో బాలుడిని తీసుకున్నారు.

Similar News

News November 17, 2025

ఖమ్మం టీహబ్‌లో సాంకేతిక సమస్యలు!

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.

News November 17, 2025

ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

image

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 17, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} జిల్లాలో నేటి నుంచి స్కూళ్లలో తనిఖీలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం