News April 13, 2025

ఖమ్మంలో నేడు ఎంపీ పర్యటన వివరాలు

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వైద్యుల పునశ్చరణ తరగతుల శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి లో పద్మశ్రీ వనజీవి రామయ్య అంతిమయాత్రలో పాల్గొంటారని చెప్పారు

Similar News

News December 5, 2025

భామిని: లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించిన సీఎం

image

భామినిలోని జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సీఎం చంద్రబాబు
ముచ్చటించారు. అనంతరం విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించి విషయ పరిజ్ఞానాన్ని మరింత ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు.

News December 5, 2025

GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. విద్యార్థిని స్పాట్ డెడ్

image

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో SRM యూనివర్సిటీ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మృతురాలు SRMలో BBA చదువుతున్న మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 5, 2025

నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు: శశిథరూర్

image

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గొంతు వినిపించేందుకు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీలో నాది ఏకైక గొంతు కావచ్చు. కానీ పార్లమెంటులో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికే నన్ను ఎన్నుకున్నారు. అరవడానికో, గొడవలు చేయడానికో కాదు. వారి కోసం, దేశం కోసం మాట్లాడేందుకు పంపించారు’ అని అన్నారు.