News April 13, 2025
ఖమ్మంలో నేడు ఎంపీ పర్యటన వివరాలు

ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో వైద్యుల పునశ్చరణ తరగతుల శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి లో పద్మశ్రీ వనజీవి రామయ్య అంతిమయాత్రలో పాల్గొంటారని చెప్పారు
Similar News
News November 21, 2025
అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
News November 21, 2025
ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర ఎంతంటే..?

గురువారం అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలి రాగా ధర ఆశించిన స్థాయిలో రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.6,850 పలికింది. ధరలు పెరిగేలా వ్యాపారులు, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
News November 21, 2025
రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


