News August 14, 2024

ఖమ్మంలో భట్టి, భద్రాద్రికి తుమ్మల, వరంగల్‌‌లో పొంగులేటి

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేసేవారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారని చెప్పారు. అటు వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Similar News

News December 6, 2025

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లకు, అత్యవసర సేవలలో పనిచేసే ఓటర్లకు సౌకర్యం కల్పించామని చెప్పారు. దీనికోసం పోస్టల్ ఓటింగ్ సెంటర్/ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ సంబంధిత మండలాల ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేశామన్నారు.

News December 6, 2025

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

image

బాబ్రీ మసీదు కూల్చివేత రోజు (డిసెంబర్ 6) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. అనుమానిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.

News December 6, 2025

మూడో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 7 మండలాల్లోని 191 గ్రామ పంచాయితీలకు గాను మొత్తం 1025 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు S-109, కల్లూరు S-124, పెనుబల్లి S-158, సత్తుపల్లి S-106, సింగరేణి S-157, తల్లాడ S-145, వేంసూరు 126 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కాగా నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది.